పోర్న్ వీడియోలు చూస్తావా..? హాజీపూర్ హత్య కేసుల నిందితుడికి కోర్టు ప్రశ్న..
హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణను ఫోక్సో స్పెషల్ కోర్టు జనవరి 3వ తేదీకు వాయిదా వేసింది. మనీషా హత్య కేసుకు సంబంధించి గురువారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా 29 మంది సాక్ష్యుల వాంగ్మూలాలను న్యాయమూర్తి చదివి వినిపించారు.
వాటిపై శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించగా.. చాలా ప్రశ్నలకు కాదు,లేదు,తెలియదంటూ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. నీ తరుపున ఎవరైనా సాక్షులను తీసుకువస్తావా..? అని న్యాయమూర్తి అడగ్గా.. కుటుంబ సభ్యులను తీసుకువస్తానని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. దీంతో జనవరి 3వ తేదీ వారిని కోర్టుకు తీసుకురావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

గురువారం విచారణ సందర్భంగా కర్నూలులో జరిగిన సువర్ణ హత్య కేసు గురించి కూడా న్యాయమూర్తి నిందితుడిని విచారించారు. సువర్ణ హత్యతో నీకేమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా లేదని బదులిచ్చాడు. అసలు ఆమె ఎవరో తెలియదని చెప్పాడు.
మరి బాలిక దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిందని న్యాయమూర్తి చెప్పగా.. ఎస్ఓటీ పోలీసులే సిరంజీతో దుస్తులపై వాటిని చల్లారని చెప్పినట్టు సమాచారం.ఇక పోర్న్ వీడియోలు చూస్తావా..? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేదని చెప్పినట్టు తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications