మంథని మధుకర్ రీపోస్టుమార్టమ్: ఫోరెన్సిక్ బృందాన్ని పంపించాలన్న హైకోర్టు..
పిటిషన్ తో ఏకీభవించిన హైకోర్టు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించేందుకు అనుమతినిచ్చింది.
మంథని: శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఆసుపత్రిలో మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్తో ఏకీభవించిన హైకోర్టు ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించేందుకు అనుమతినిచ్చింది.
రీపోస్టు మార్టమ్ అనంతరం నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రత్యేక వైద్య బృందాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, తొలుత నిర్ణయించినట్లుగా కాకుండా మధుకర్ మృతిచెందిన ప్రదేశంలోనే రీపోస్టుమార్టమ్ జరపాలని కోర్టు ఆదేశించినట్లుగా సమాచారం.
ఉస్మానియా వైద్య బృందం ఫోరెన్సిక్ అండ్ కాకతీయ మెడికల్ సిబ్బందితో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రీపోస్టుమార్టమ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే, మంథని మధుకర్ అనుమానస్పద మృతి కేసులో విచారణను పక్కదోవ పట్టించారన్న ఆరోపణలున్నాయి. ఇందులో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పాత్రపై కూడా అనుమానాలు రేకెత్తడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.
కేసును పక్కదోవ పట్టించి దళిత కుటుంబంపై స్థానిక సీఐ జులుం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 48దళిత సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు మంథనిలో మెరుపు ధర్నా నిర్వహించాయి. దీంతో పోలీసులు దిగిరాక తప్పలేదు. సీఐపై వేటు వేసి ఆయన స్థానంలో కొత్త నటేష్ ను నియమించారు. అలాగే కేసు బాధ్యతలను ఏసీపీ సింధుశర్మ స్వీకరించారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అయితే రీపోస్టుమార్టమ్ విచారణ పారదర్శకంగా జరగాలంటే ఫోరెన్సిక్ వైద్య బృందంతో పాటు, మెజిస్ట్రేట్, కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో రికార్డింగ్ సహకారంతో రీపోస్టుమార్టమ్ నిర్వహించాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన కోర్టు ఫోరెన్సిక్ వైద్య బృందాన్ని మంథనికి పంపించేందుకు అనుమతినిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కుటుంబ సభ్యుల మధ్యే రీపోస్టు మార్టమ్ నిర్వహించాలని పిటిషన్ లో అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం, ఫోరెన్సిక్ నిపుణులు, మెజిస్ట్రేట్ సమక్షంలో, వీడియో రికార్డింగ్ తో చేయాలి. వాస్తవాలకు దూరంగా అధికారుల విచారణతో చేయించింది. రీపోస్టుమార్టమ్ తో నిజాలు బయటపపడుతాయని నమ్మకం. పోస్టుమార్టమ్ లో వాస్తవాలు మాయం.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications