చిన్నారితో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న దంపతులు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారితో సహా దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్ధానికులు చిన్నారని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. చిన్నారి పరిస్ధితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థిని సమీక్షిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతేదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలకారణంగానే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య సరైన ఒద్దిక లేకపోవడం వల్ల తరుచూ ఇద్దరూ గొడవ పడుతున్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications