హైదరాబాద్ TO చార్ధామ్ యాత్ర... తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే యాత్రల్లో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వతాల్లో నెలకొని ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను దర్శించే పవిత్ర తీర్థయాత్రనే చార్ ధామ్ యాత్ర అని పేర్కొంటారు. అయితే హైదరాబాద్ నుంచి చార్ ధామ్ యాత్ర వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ అందింది. IRCTC టూరిజం తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం తక్కువ ధరకే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి 'చార్ ధామ్ యాత్ర'. ప్రతి హిందువు ఈ యాత్రను తమ జీవితంలో ఒకసారైనా చేయాలని అనుకుంటారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ధామ్ లను దర్శించుకుని తరిస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC శుభవార్త తెలిపింది. చార్ ధామ్ యాత్రికుల కోసం తక్కువ ధరకే స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ 10 రాత్రులు, 11 రోజుల టూర్ ప్యాకేజీ.
ఈ చార్ ధామ్ టూర్ 2026 మే 17న ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు మొదటగా హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ విమానంలో ప్రయాణిస్తారు. మొదటిరోజు ఉదయం 08:45 గంటలకు విమానం స్టార్ట్ అవుతుంది. 11:15 గంటలకు డెహ్రడూన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హిమాలయాల మీదుగా రోడ్డు ప్రయాణం ఉంటుంది. అక్కడ విశ్రాంతి తర్వాత జాంకీ చట్టి చేరుతారు. అక్కడి నుంచి యమునోత్రి ఆలయానికి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.
యుమునోత్రి దర్శనం తర్వాత ఉత్తరకాశీకి బయల్దేరతారు. అక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయం దర్శనం ఆ తర్వాత గంగోత్రి ఆలయానికి చేరుతారు. ఇక్కడి నుంచి కేదార్ నాథ్ ఆలయానికి బయలుదేరతారు. సాయంత్రం హారతి, ఉదయం అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత బద్రినాథ్ ఆలయం దర్శనం ఉంటుంది. అలా చార్ ధామ్ యాత్ర పూర్తి చేసిన తర్వాత హరిద్వార్ చేరి గంగా హారతి దర్శనం చేసుకుంటారు.

అలా ఇక సాయంత్రం 5:45 గంటలకు డెహ్రాడూన్ నుండి బయల్దేరితే రాత్రి 8:15 కు హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.74,430 అలాగే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.79,440 ఉంటుంది. ఇక సింగిల్ ఆక్యుపెన్సీకి అయితే రూ.91,610 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications