Telangana Inter Exams2023: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఒక నిమిషం నిబంధన అమలు..
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైయ్యాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి.
రాష్ట్రంలో 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,03,000 మంది విద్యార్ధులు హాజరవుతుండగా. మొదటి సంవత్సరం 4,84,197 మంది, ద్వితీయ సంవత్సరానికి 5,19,793 మంది హాజరుకానున్నారు.
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమేరా నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏవిధమైన సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్, బ్లూటూత్, ట్యాబ్లు, డిజిటల్ పరికరాలకు అనుమతి లేదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. ప్రతి 20 నుంచి 25 కేంద్రాలకు ఒక అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. కాగా ఈసారి కూడా ఒక నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు.

పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ఒక నిమిషం లేట్ వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించారు.
ఏ ఇబ్బంది వచ్చినా 040-24601010, 040-24655027 ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా స్టూడెంట్లే బోర్డ్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications