ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయి : తప్పుచేసినవారిపై చర్యలు, జనార్ధన్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనల్లో తప్పులు దొర్లినట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్పించిన నివేదికను మీడియాకు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తప్పుచేసిన బోర్డు, ఏజెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పబ్లికేషన్ లో తేడా
ఇంటర్ ఫలితాల్లో తప్పుకు ప్రధాన కారణం పబ్లికేషన్ తో తేడా జరిగినట్టు కమిటీ గుర్తించిందని పేర్కొన్నారు. ఆరు తప్పులు జరిగినట్టు వెంకటేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ గుర్తించిందని .. దానికి గల కారణాలను 10 పేజీల్లో నివేదించిందని తెలిపారు. కొందరు విద్యార్థులకు సంబంధించి 99కి బదులు 00 మార్క్ పెట్టడంతో తప్పు జరిగిందన్నారు.

సెంటర్ మార్చడంతో తప్పిదం
496 మంది విద్యార్థులు సొంత కాలేజీలో సెంటర్ పడిందని చెప్పారు. అయితే చివరి క్షణంలో వారి సెంటర్ మార్చి పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. అంతకుముందు కేటాయించిన సెంటర్ లో అబ్ సెంట్ పడిందని .. అటెండెట్ పడకపోవడంతో కొంచెం పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఎంఈసీకి చెందిన 4 వేల 9 వందల మంది విద్యార్థుల విషయంలో ఇలాంటి పొరపాటే జరిగినట్టు తెలిపారు. వీరేగాక మరికొందరు విద్యార్థులు ఆన్సర్ షీట్ లో సరిగా బబుల్ చేయకపోవడంతో మార్కుల లిస్టులో తేడా చూపిందని వెల్లడించారు.

ఇక నష్టం జరగనీయం
మొత్తం 9 లక్షల 70 వేలమంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సరైన చర్యలు తీసుకుంటామని భరోసా నిచ్చారు. జాగఫ్రికి చెందిన 531 మంది విద్యార్థుల ప్రాక్టికల్ మార్కుల మార్కుల షిట్ లో మిస్సైందని తెలిపారు. అందుకే ఫలితాల్లో తేడా జరిగిందని పేర్కొన్నారు. ప్రధానంగా కోడింగ్, డీ కోడింగ్ తో పాటు సాప్ట్ వేర్ సమస్య ఏర్పడిందని .. అందుకే ఫలితాలపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

అందరికీ ఫ్రీ రీ వాల్యుయేషన్
ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వాల్యుయేషన్ చేస్తున్నట్టు గుర్తుచేసిన జనార్థన్ రెడ్డి .. 80 శాతం మార్కులతో పాసై .. మిగతా సబ్జెక్టుల్లో ఫెయిలైన వారి పేపర్లను కూడా ఫ్రీగా రీ వాల్యుయేషన్ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే 3.40 లక్షల మంది ఫ్రీగా వాల్యుయేషన్ చేస్తున్నామని .. దానికి అదనంగా 22 వేల 141 మంది పేపర్లను రీ వాల్యుయేషన్ చేస్తామని తెలిపారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications