ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. తెలంగాణలో ఆరుగురు విద్యార్ధులు ఆత్మహత్య
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మరోసారి విషాదాన్ని నింపుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీ నాడు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యామన్న ఆవేదనతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
మొత్తంగా ఇప్పటివరకు క్షణికావేశంతో ఆరుగురు విద్యార్థులు బలవన్మరణం చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు, హైదరాబాద్ లో ముగ్గురు, మేడ్చల్ పరిధిలో ఒకరు మృతి చెందారు.

మృతి చెందిన వారి వివరాలు..
- మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో అశ్విత అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తక్కువ మార్కులు రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
- యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురానికి చెందిన ఓ విద్యార్థి, ఫెయిలైనందుకు మనస్తాపానికి గురై బలవన్మరణం చెందాడు.
- హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్కు చెందిన ఓ యువకుడు, బల్కంపేటలోని ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ చదువుతున్నాడు. ఫెయిలవడంతో తీవ్ర దిగులుతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరి వేసుకున్నాడు.
- నాగోలు తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని, ఒక సబ్జెక్ట్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురై ప్రాణం తీసుకుంది.
- బంజారాహిల్స్ ఇందిరానగర్కు చెందిన నిష్ఠ అనే విద్యార్థిని కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంది.
- మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది.
విద్యార్ధులకు సూచనలు..
పరీక్షలు ఫలితాలు మన భవిష్యత్తుకు మంచి మార్గం చూపేవి మాత్రమే. అంతే కానీ ఫెయిల్యూర్, ఓటమి అనేది ముగింపు కాదు. అవి ఒక గొప్ప ప్రారంభానికి ఆరంభం లాంటివి. ఒక్క ఫెయిల్యూర్తో జీవితం ఆగిపోదు. మీ విలువను మార్కులు నిర్ణయించలేవు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి.. పరీక్షలు మళ్లీ రాసుకునే అవకాశం ఉంటుంది కానీ జీవితాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేం. క్షణికావేశంలో ంఈ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చకండి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications