పుచ్చలపల్లి సుందరయ్యపై టీ మంత్రి సంచలనవ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటం పైన పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథంలో సమస్త సమాచారం, అనుభవాలు భీంరెడ్డి నర్సింహారెడ్డివి అయితే సుందరయ్య మాత్రం ఆయన పేరే వేసుకొని ఖ్యాతి గడించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నాడు జరిగిన భీంరెడ్డి నర్సింహా రెడ్డి వర్ధంతి సభలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు.

1972లో జైలులో ఉన్న సమయంలో భీంరెడ్డి నర్సింహా రెడ్డి ఇచ్చిన సలహాలు, సూచనలు, అనుభవాల మేరకే సుందరయ్య తెలంగాణ సాయుధ పోరాటంపై పుస్తకాన్ని తెచ్చారన్నారు. కానీ ఎక్కడా భీంరెడ్డి పేరు ప్రస్తావించలేదన్నారు. ఈ విషయంలో భీంరెడ్డి అప్ప్లో సుందరయ్యను నిలదీసినందుకే అధికారికంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే ధైర్యం చేయలేదన్నారు.
సుందరయ్యను అవమానించాలని తన ఉద్దేశ్యం కాదని, తెలంగాణ చరిత్రలో భీంరెడ్డి పాత్ర మనసకబారుతుండటం వల్లే తాను ఇలా చెప్పవలసి వచ్చిందన్నారు. బీంరెడ్డి స్మారకార్థం సూర్యాపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, మరో నాయకుడు ధర్మభిక్షం విగ్రహాన్ని కూడా నిర్మిస్తామని చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications