ఆ విషయంలో మాత్రం జగన్ నో కామెంట్..!
ఏపీలో పార్టీ ఫిరాయింపుల మీద అధికార పక్షం టీడీపీని కడిగి పారేస్తున్న జగన్ తెలంగాణ విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకున్నట్టు లేదు. తాజాగా తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అధినేత జగన్ ఈ చేరికపై మౌనం వహించడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో పట్టు నిలుపుకోవడం ఇక కష్టమని భావించే.. జగన్ పొంగులేటి చేరికపై స్పందించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ దెబ్బకు ఏళ్లుగా పట్టు నిలుపుకున్న కాంగ్రెస్, టీడీపీ లాంటి పార్టీలే తెలంగాణలో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఇక అంతంతమాత్రంగానే ఉన్న వైసీపీ పరిస్థితి ఇందుకు మినహాయింపేమి కాదన్న ఆలోచనతోనే జగన్ పొంగులేటి విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదనే వాదనలు వినిసిస్తున్నాయి.
ఏదేమైనా పొంగులేటి ఇచ్చిన షాక్ తో తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్టే కనిపిస్తోంది.