జగన్తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అనుమానం కలుగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ వేళ ఏపీ సీఎం జగన్తో చీకటి ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర మాట విని తుమ్మడిహెట్టి కాదని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. తుమ్మడిహెట్టి ద్వారా కమీషన్లు రావు అని తెలిసి కాదనుకున్నారా అని అడిగారు. కేసీఆర్ అసమర్ధతతో మెలుగుతున్నారా..? లేదంటే జగన్తో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు స్లోగన్తో అధికారం చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు మౌనమునిగా ఎందుకు మారారు అని అడిగారు. రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్.. శ్రీశైలం నుంచి రోజు మూడు టీఎంసీల నీటిని అదనంగా తీసుకెళ్లేందుకు ఏపీ ప్రయత్నిస్తుంటే ఎందుకు ఆపడం లేదు అని అడిగారు. శ్రీశైలం నుంచి 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడుకు తరలిస్తే మన రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.

ఎన్నికల తరువాత జగన్, కేసీఆర్ క్లోజ్ అయ్యారని, గతేడాది మూడు సార్లు కలిసారని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు నుంచి అదనపు నీళ్ళు తీసుకొవద్దని జగన్కు ఎందుకు చెప్పడం లేదన్నారు. దీంతో తమకు అనుమానం కలుగుతుందని చెప్పారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications