ఏది నిజం?: ఇద్దరు కూతుళ్లను చంపిన రజనీ, వీడని మిస్టరీ
హైదరాబాద్: రజనీ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను చంపిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. తన భర్త తన పెద్ద కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో తాను పిల్లలను చంపినట్లు రజనీ చెప్పింది. భర్త వినయ్ చుట్కేను పోలీసులు విచారించారు.
రజనీ అతనిపై చేసిన ఆరోపణలు నమ్మే విధంగా లేవని అతన్ని విచారించిన తర్వాత పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. రజనీ మానసిక స్థితి సరిగా లేదని వినయ్ చెప్పినట్లు సమాచారం. ఆమె మానసికంగా దృఢంగానే ఉందని ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పారు.

దాంతో పోలీసులు రజనీ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. రజనీ గురువారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. రజనీని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. అయితే, కూతుళ్లను రజనీ చంపడానికి గల అసలు కారణమేమిటనే విషయాన్ని పోలీసులు నిర్దారించుకోలేకపోతున్నారు.
ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్న వినయ్, రజనీ తమ ఇద్దరు కూతుళ్లతో సికింద్రాబాదులోని అడ్డగుట్ట టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. అతను ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. అయితే, అత్యంత దిగ్బ్రాంతికి గురి చేస్తూ రజనీ తన ఇద్దరు పిల్లలను చంపి, హుస్సేన్ సాగర్లో శుద్ధి చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించింన విషయం తెలిసిందే.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications