వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది : ఫ్రంటే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Loksabha Election 2019: మోదీ వేడి తగ్గింది... ఫ్రంటే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్!! | Oneindia Telugu

హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీ కూటమిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 70 ఏళ్లలో ఆ రెండు పార్టీలు దేశానికి చేసిందేమీ లేదని, వెనుకబాటుతనానికి కారణమని విమర్శించారు. సోమవారం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచారం నిర్వహించారు.

హరీశ్ కూడా స్టార్ క్యాంపెయినర్ అయిండు. మీడియా వార్తలతో సంతోష్ స్థానంలో నియామకం హరీశ్ కూడా స్టార్ క్యాంపెయినర్ అయిండు. మీడియా వార్తలతో సంతోష్ స్థానంలో నియామకం

మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది

మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది

దేశంలో ప్రధాని నరేంద్రమోదీ వేడి తగ్గిందని విమర్శించారు కేటీఆర్. ఏ సర్వే చూసిన బీజేపీ కూటమికి 150 స్థానాలకే పరిమితం అవుతాయని చెబుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కూటమి 100 సీట్ల వద్దే ఆగిపోతుందని సర్వేల ద్వారా తేటతేల్లమవుతోందన్నారు. ఇకనైనా పార్టీ నేతలు మాయమాటలు చెప్పొద్దని హితవు పలికారు.

ఆ పార్టీలు గెలిస్తే లాభం లేదు

ఆ పార్టీలు గెలిస్తే లాభం లేదు

కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీకి లాభం, బీజేపీ గెలిస్తే కమళ దళానికి మంచి జరుగుతోంది. కానీ తెలంగాణ గడ్డకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. విజులైన ఓటర్లు ఆలోచించి .. తెలంగాణ అభివృద్ధి కోసం ఓటేయాలని కోరారు.

బీజేపీకి వ్యతిరేకం

బీజేపీకి వ్యతిరేకం

దేశంలో ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలుతాయని జోస్యం చెప్పారు. మాయావతి, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఈ పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

16 + 160

16 + 160

రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టంచేశారు కేటీఆర్. ఆ రెండు పార్టీలు తమ గోడును పట్టించుకోవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 16 చోట్ల టీఆర్ఎస్, 1 ఎంఐఎంతో కలిసి దేశంలో 160 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల ప్రచారంలో మంత్రి ఈటల రాజేందర్, అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

English summary
Ktr criticized Prime Minister Narendra Modi. The survey said that the BJP would be restricted to 150 seats. The Congress party was deeply dismayed. Survey said that the Congress alliance would end at 100 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X