Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్వీట్ యుద్ధం: కేటీఆర్ విమర్శలు, కిషన్ సైటైర్లు

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లోనే గాక సోషల్ మీడియా వేదికగానూ విమర్శలు చేసుకుంటున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆయనకు ధీటుగా బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు.

ktr and kishan reddy had satirical comments each other

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి ఓ ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటించి, ఇక్కడి వ్యవసాయం ప్రగతి గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతుంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు.

కేటీఆర్‌ విమర్శలపై కిషన్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ మంచి కనిపించినా మెచ్చుకోవడం ఆరోగ్యకరమైన లక్షణమన్నారు.

తెలంగాణ ప్రతినిధులు కూడా గుజరాత్‌కు వెళ్లి సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అధ్యయనం చేసిన విషయాన్ని మరువరాదని గుర్తు చేశారు. అంతేగాక, హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళన పనులు ఎక్కడ వరకు వచ్చాయంటూ నిలదీశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+