నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం
నాంపల్లి ఎగ్జిబిషన్ లోని ఓ ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భవనం సెల్లార్ నుంచి ఐదు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మరోవైపు షాపు యజమానిపై క్రిమినల్ చర్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు చేశారు.
నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు భవనం సెల్లార్ నుంచి ఐదు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. దాదాపు 22 గంటలపాటు శ్రమించాయి రెస్క్యూ బృందాలు. చిన్నారులు ప్రణీత్, అఖిలతో పాటు బీబీ, ఇంతియాజ్, హబీబ్ ల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మరోవైపు అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఘటనలో ఐదుగురు మరణించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.

ఇక నాంపల్లిలోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. ఈ నాలుగంతస్థుల భవనంలో అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాప్తి చెందాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అగ్ని మాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్ వాహనాలు, స్కై లిఫ్ట్ క్రేన్ సహాయంతో మంటలు ఆర్పారు.












Click it and Unblock the Notifications