ఆ డీసీపీ, ఏసీపీ వద్దు: ఈసీకి నందమూరి సుహాసిని ఫిర్యాదు, డబ్బు దొరకలేదని జూపూడి
హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ పోలీసు అధికారులను బదలీ చేయండి
మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, కూకట్పల్లి ఏసీపీ సురేంద్ర టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సుహాసిని ఫిర్యాదు చేశారు. వారిని బదలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను కూడా తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్, పాత బోయినపల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని సుహాసిని కోరారు.

కావాలనే చేస్తున్నారు.. జూపూడి
మరోవైపు, తన ఇంటివద్ద నగదు దొరికిందనే ఆరోపణలపై ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ బుధవారం స్పందించారు. కూకట్పల్లి బాలాజీనగర్లోని తన నివాసంలో ఈసీ అధికారులు తనిఖీలు చేశారని, అయితే ఎలాంటి నగదు లేదని వెళ్లిపోయారన్నారు. ఇలా ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో తెలియట్లేదన్నారు. తాము ఎక్కడ బతకాలో తెలియడం లేదని అన్నారు. బంధువుల్ని కూడా తమ ఇంట్లోకి రానీయడం లేదన్నారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలని, ఇంట్లో తన భార్య తప్ప ఎవరూ లేరన్నారు. కావాలనే చేస్తున్నారని, ఇది తెరాస ప్రభుత్వానికి సరికాదన్నారు.

తనిఖీలు.. పట్టుబడ్డ రూ.23 లక్షలు
ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వరంగల్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తరలిస్తున్న రూ.23 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు కాశీబుగ్గ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్ పైన వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను తనిఖీ చేశారు. వారి వద్ద నగదు పట్టుబడింది.

ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు
పరకాల నియోజకవర్గంలోని మొగిలిచర్లలో ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండకు చెందిన టీఆర్ఎస్ నేత ఈ డబ్బును అందించినట్లు వారు చెప్పారని పోలీసులు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశామని చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications