Huzurabad: హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి గెలుపుతో తప్పిన శవయాత్ర..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల కౌశిక్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. తనకు కూతురుతో కూడా ప్రచారం చేయించారు. చివరికి కౌశిక్ రెడ్డి గెలిపించకపోతే తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని హెచ్చరించారు." మీరు గెలిపిస్తే జైత్రయాత్రగా వస్తా లేకుంటే శవయాత్ర జరుగుతుందని" వ్యాఖ్యానించారు.
దీంతో హుజురాబాద్ ప్రజలు భయపడిపోయి జాలి పడి ఓటు వేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈటలకు స్థానికంగా మంచి పేరు ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో జనం బీఆర్ఎస్ వైపు మొగ్గాల్సి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కరీంనగర్ లో బండి సంజయ్ గంగుల కమలాకర్ చేతిలో 326 తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ తెలంగాణలో బీజేపీ బలపడింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. గోషామహల్, నిర్మల్, కామారెడ్డి, ముథోల్, ఆర్మూర్, ఆదిలాబాద్, సిర్పూర్ లో విజయం సాధించింది. 2018 ఒక్క సీటు గెలిచిన బీజేపీ ఇప్పుడు 8 సీట్లు గెలిచింది. దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు పోటీ చేయగా.. ముగ్గురు ఓడిపోయారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications