'చంద్రబాబు వేసే దానికి కక్కుర్తిపడి, రేవంత్ను ముంచడం ఖాయం'
అసెంబ్లీ నిర్వహణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ఒరవడి సృష్టించారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గురువారం అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ నిర్వహణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ఒరవడి సృష్టించారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గురువారం అన్నారు. సమావేశాలు ప్రజలకు ఆశలు కల్పిస్తే, ప్రతిపక్షాలకు నిరాశ కల్పించాయన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకూడదని రేవంత్ రెడ్డి పాలసీగా పెట్టుకున్నారన్నారు. తాము ప్రాజెక్టులు నిర్మించడం ఖాయమని, అందులో రేవంత్ రెడ్డిని ముంచడం ఖాయమన్నారు.
రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు వేసే బొక్కల కోసం కక్కుర్తిపడి మాట్లాడటం మానుకోవాలన్నారు. కందులకు గిట్టుబాటు ధర కల్పించడం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగిందన్నారు. సభలో ఎన్నో విషయాలు చర్చించామన్నారు.
ప్రతిపక్షాల కంటే ప్రభుత్వమే ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీలో కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్తోపాటు పలు అంశాలపై సభలో చర్చ జరిగిందన్నారు.
ప్రతీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే ప్రతిపక్షాలే సభ నుంచి పారిపోయాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇలా జరగాలని దేశానికి మార్గదర్శనం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
సమావేశాలు ప్రజలకు ఆశలను కల్పిస్తే ప్రతిపక్షాలకు నిరాశను కలిగించాయన్నారు. ప్రతిపక్షాలు నిరాశకు గురయ్యాయంటే ప్రజా సమస్యలు తొలగినట్టేనన్నారు. ప్రతిపక్షాలకు తెలంగాణ అభివృద్ధిని గురించి సీఎం కేసీఆర్ వివరించారన్నారు. సభ నిర్వహణను విపక్షాలు సైతం మెచ్చుకున్నాయన్నారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications