కాళేశ్వరం, బీఆర్ఎస్ - కాంగ్రెస్ పై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..!!
రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయి, కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు రెండూ ఒకటేనని ఆరోపించారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్, లూఠ్ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో త్వరలో 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని చెప్పుకొచ్చారు.
కుమ్మక్కయ్యారు: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుగా వారి పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

15 రోజుల్లో 5 ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామని, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని స్థాపించామని తెలిపారు. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మోదీ గ్యారంటీ అంటే, కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. పతీ క్షణం మీకోసం పని చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. 140 కోట్ల ప్రజలే తన కుటుంబమని చెప్పుకొచ్చారు.
ప్రజల కలల కోసమే: ప్రజల కలల సాకారం కోసం తాను పని చేస్తున్నాని వెల్లడించారు. రామమందిర ద్వారాలు తెలంగాణలో తయారయ్యాయన్నారు. రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలి.' అని మోదీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని, ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు. ఈ పదిహేను రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో రెండు ఐఐటీలు, 3 ఐఐఎంలు, ఒక్క ఐఐఎస్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేసారు. ఎన్నికలు వచ్చినపుడు ఎన్నికల గురించి చూసుకుందామని ప్రధాని వ్యాఖ్యానించారు. అబ్ కీ బార్ నాలుగు వందలపైన.. బీజేపీకి ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.

ప్రజా మద్దతు కావాలి: తెలంగాణలోని గ్రామగ్రామంలో యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కలిసి అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణలో సమ్మక్కసారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మోదీకి గ్యారెంటీపై దేశంలో ప్రస్తుతం చర్చ నడుస్తోందన్నారు.
పసుపు రైతులకు అన్ని తరపున మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణకు ఒక మెగాటెక్స్టైల్ పార్కు ఇచ్చామన్నారు. తప జీవితం తెరిచిన పుస్తకంగా ప్రధాని పేర్కొన్నారు. తాను చిన్నప్పుడే ఇల్లు విడిచిపెట్టానని..తనకు ప్రత్యేక కలలు లేవన్నారు. నా దేశం నా కుటుంబం అన్న భావనతో ప్రజల కోసం తాను జీవిస్తున్నానని వివరించారు. అందరి ఆశీర్వాదం..ప్రేమ తనకు కావాలని మోదీ కోరారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications