పైకి మసాజ్ సెంటర్! లోపల మాత్రం వ్యభిచార దందా, యువతులతోపాటు 8మంది అరెస్ట్
హైదరాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచార దందా కొనసాగిస్తున్న ముఠా ఆటను కట్టించారు పోలీసులు. నిర్వాహకుడితోపాటు ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకుని నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
చిలకలగూడ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహారాజు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూర్కు చెందిన సమీర్ అగర్వాల్(40) మెట్టుగూడలోని గాయత్రి ప్లాజా మూడో అంతస్తులోని 302 ప్లాట్లో స్టార్స్పా పేరుతో ఆరునెలల కిందట మసాజ్ సెంటర్ను ఏర్పాటు చేశారు.

దీనిద్వారా ఆశించిన ఆదాయం రాకపోవడంతో.. 'లోకోంటో' అశ్లీల వెబ్సైట్లో ఆకర్షించే యువతుల ఫోటోలతో పాటు ఫోన్ నంబరును ఉంచారు. అంతేగాక, కాల్ చేసే వారి పూర్తి వివరాలు సేకరించి స్పా సెంటర్కు రప్పించి వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించారు.
కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఓ కానిస్టేబుల్ను విటుడిగా పంపించి వివరాలను సేకరించారు. శనివారం రాత్రి 6గంటలకు మసాజ్ సెంటర్పై దాడిచేశారు. నిర్వాహకుడు సమీర్ అగర్వాల్తో పాటు అక్కడ పనిచేస్తున్న పశ్చిమబెంగాల్కు చెందిన ఇద్దరిని, ముగ్గురు విటులను, ఇద్దరు యువతులను కటకటాల వెనక్కినెట్టారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications