ప్రగతి భవన్ పంచాయితీ...! ఇక ఈసి చూసుకుంటుంది..!!
హైదరాబాద్ : సాధారణ ఎన్నికల సందర్బంగా కోడ్ అమలులో ఉన్నప్పుడు గమ్మత్తైన ఫిర్యాదులు అందుతుంటాయి. వీటన్నికి ఎలక్షన్ కమీషన్ సహనంతో సమాధానం చెప్పాల్సిఉంటుంది. కొన్ని సందర్బాల్లో చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కోవలో తెలంగాణ ముఖ్యమంత్రి పై ఓ అభియోగం మోపబడింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో రాజకీయ కార్యక్రమాల నిర్వహణ అంశంపై తమకు ఫిర్యాదు అందిందని రజత్ చెప్పారు .
దీనిపై టీఆర్ఎస్ నుంచి వివరణ కోరామన్నారు . ఈ అంశా న్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికల సభలో సీఎం చంద్రశేఖర్ రావు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ వీహెచ్ పీ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపామన్నారు. సంబంధిత రికార్డులను తాను స్వయంగా విన్నానని, ఫిర్యా దులో పేర్కొన్నట్టు గా సీఎం చంద్రశేఖర్ రావు మాట్లాడలేదని గుర్తించామని తెలిపారు.
మోదీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది : ఫ్రంటే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్
నిజామాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ పై రైతులు ఫిర్యాదు చేయడంతో..తాను వీడియో రికార్డులను పరిశీలిం చానని, నిబంధనల ఉల్లం ఘన ఏదీ జరగలేదని చెప్పారు . సోషల్ మీడియాలో ప్రకటనలకు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్కమిటీ) ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆ ప్రచారానికి అయ్యే ఖర్చును ప్రచార వ్యయంలో చేర్చాలని చెప్పారు . బల్క్ ఎస్సెమ్మెస్ లు, వాయిస్ మెసే జీలకూ ప్రీ సర్టిఫికేషన్ తప్పనిసరి అని చెప్పారు . రాష్ట్రంలోని ఏడు రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులకు రజత్ కుమార్ ఆమోదం తెలిపారు.