Wine Shops Close: మందు బాబులకు అలర్ట్; వైన్స్, బార్లు బంద్
మద్యం ప్రియులకు అలర్ట్. దేశ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న మద్యం విక్రయాలకు పూర్తిస్థాయి బ్రేక్ పడనుంది. జాతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రేపటి రోజును డ్రై డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైన్ షాపులు (Wine Shops) , లిక్కర్ దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. ప్రజా శాంతి భద్రతలు, వేడుకల నిర్వహణ సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రిపబ్లిక్ డే రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వైన్ షాపుల యజమానులు వినియోగదారులకు సమాచారం అందిస్తూ షాపుల వద్ద నోటీసులు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయడం పరిపాటిగా కొనసాగుతోంది. గణతంత్ర దినోత్సవంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో కూడా ఇదే విధమైన ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నిర్ణయంతో ఒక్కరోజు పాటు మద్యం విక్రయాలకు విరామం లభించనుంది.
డ్రై డే ముగిసిన అనంతరం జనవరి 27 నుంచి సాధారణంగా మద్యం విక్రయాలు పునఃప్రారంభం కానున్నాయి. జాతీయ పండుగను హుందాగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ చర్య నిదర్శనంగా నిలుస్తోంది. కాబట్టి మందు బాబులకు మద్యం కావాలంటే ఆదివారం రాత్రి పది గంటలలోపే తెచ్చుకోవాలి. లేదంటే సోమవారం ఉదయం 10 గంటల వరకు ఆగాల్సిందే












Click it and Unblock the Notifications