గాల్లోకి ఎగిరి కిందపడ్డారు: నెహ్రూ జూ పార్కు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కుకు అతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజ్లో రికార్డు అయ్యాయి.
సీసీ పుటేజ్లో రికార్డైన దాని ప్రకారం ఓ టూవీలర్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కుడివైపు నుంచి ఎడమవైపు రోడ్డు దాటుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీ కొట్టింది. దీంతో టూవీలర్పై వెళ్తున్న ఆ ఇద్దరూ వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు.
ఈ రోడ్డు ప్రమాదంలో వారిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, టూవీలర్ ధ్వంసమైంది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఎస్సార్నగర్, యూసఫ్గూడ, అమీర్పేట, ఎర్రగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.
కూకట్పల్లి ప్రాంతంలో చిరుజల్లులు పడ్డాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లిలో వర్షం కురుస్తోంది. చిన్నపాటి వర్షానికే ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.