డాక్టర్ల కాల్పుల ఘటనలో మలుపులు: శశికుమార్, ఉదయ్ మధ్య కోటి వివాదం
హైదరాబాద్: హైదరాబాదులోని హిమాయత్నగర్లో జరిగిన డాక్టర్ల కాల్పుల ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కోటి రూపాయల వివాదమే కాల్పుల ఘటనకు, ఆ తర్వాత శశికుమార్ మృతికి దారి తీసినట్లు భావిస్తున్నారు.
కాల్పుల ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన డాక్టర్ సాయి కుమార్ను పోలీసులు నారాయణగుడా పోలీసు స్టేషన్లో ఐదు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయ్ కుమార్ శశికుమార్ను డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పించారని చెబుతున్నారు.
వివరాలు ఈ విధంగా ఉన్నాయి - మాదాపూర్లోని ఆస్పత్రిలో శశికుమార్ 75 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. మరో 25 లక్షల రూపాయలు డాక్టర్ ఉదయ్ కుమార్కు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులకు ఉదయ్ నెలనెలా వడ్డీ ఇస్తానని చెప్పాడు. ఇంతలో డైరెక్టర్ల బోర్డు నుంచి ఉదయ్ శశికుమార్ను తప్పించాడు. ఆ స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని నియమించాడు.

తనను సీఈవోగా నియమించాలని, ఆస్పత్రి బాధ్యతలు తనకు అప్పగించాలని శశికుమార్ పట్టబట్టాడు. దానివల్ల శశికుమార్కు నెలకు రూ. 3.5 లక్షల రూపాయలు వేతనంగా ఇవ్వాల్సి వస్తుందని ఉదయ్ కుమార్ భావించి అందుకు నిరాకరించాడు. ఈ వివాదం ఏడాది కాలంగా నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చర్చల కోసమంటూ శశికుమార్ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు పిలిచారు. హోటల్లో వాగ్వివాదం జరిగింది. బయటకు వచ్చి ఒకే కారులో బయలుదేరారు. అక్కడ కూడా గొడవ జరిగింది. ఈ పరిస్థితిలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ఇదిలావుంటే, తన భర్తను కిడ్నాప్ చేసి, హత్య చేశారని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని శశికుమార్ భార్య క్రాంతి ఆరోపిస్తున్నారు. అయితే, ఉదయ్పై కాల్పులు జరిగిన రివాల్వర్, శశికుమార్ ఆత్మహత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఒక్కటేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అది శశికుమార్కు చెందిన లైసెన్స్డ్ గన్. అది 2012 నుంచి శశికుమార్ వద్ద ఉంటోందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications