సికింద్రాబాద్ నుంచి కర్ణాటకకు ప్రత్యేక రైళ్లు: ఏపీలో హాల్ట్ స్టేషన్లు

Special Trains: శ్రావణమాసం రాకతో పండగ సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

SCR runs Special trains between from Secunderabad to Mysuru and Charlapalli to Kakinada Town

ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లన్నీ కూడా శుక్రవారం అంటే ఈ నెల 8వ తేదీన పట్టాలెక్కబోతోన్నాయి. ఈ నెల చివరి వారం వరకూ రాకపోకలు సాగించనున్నాయి. వీటికి సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల అయింది.

సికింద్రాబాద్- మైసూరు ప్రత్యేక రైళ్లు..

  • 8వ తేదీ నుంచి ఈ నెల 29 వరకు ప్రతి శుక్ర, సోమ వారాల్లో రాత్రి 10:10 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07033 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది.
  • 9వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి శని, మంగళవారాల్లో సాయంత్రం 5:20 నిమిషాలకు మైసూరు నుంచి బయలుదేరే నంబర్ 07034 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
  • బేంగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు కంటోన్మెంట్, కేఎస్ఆర్ బెంగళూరు, కెంగేరి, మండ్య మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

చర్లపల్లి- కాకినాడ ప్రత్యేక రైలు.. (సింగిల్ ట్రిప్)

  • ఈ నెల 8వ తేదీన శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07031 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
  • ఈ నెల 10వ తేదీన ఆదివారం రాత్రి 8:10 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 07032 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది సింగిల్ ట్రిప్ మాత్రమే.
  • నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+