ఈసికి ఫిర్యాదు చేస్తాం.. ఇదీ విషయం: కేటీఆర్ పదవికి ఎసరు పెట్టారు?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మంత్రి పదవి ఊడటం ఖాయమంటూ విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మంత్రి పదవి ఊడటం ఖాయమంటూ విమర్శించారు.

మంత్రి పదవి ఊడుతుంది
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో కొనసాగుతూ హిమాన్ష్ మోటార్స్ సంస్థకు డైరెక్టర్గా ఉన్న కేటీఆర్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 9 ప్రకారం మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రయివేటు సంస్థలకు డైరెక్టర్గా ఉండకూడదన్నారు. కేటీఆర్ పైన ఫిర్యాదు చేస్తే ఆయన మంత్రి పదవి ఊడటం ఖాయమన్నారు.
Recommended Video


చైర్మన్
ఇదిలా ఉండగా, ఓ ప్రజాప్రతినిధి ఓ కంపెనీలో డైరెక్టర్గానో, చైర్మన్గానో ఉండవచ్చు. వ్యాపారం చేయడం తప్పు కాదు. కానీ ఆ కంపెనీ లేదా సంస్థ నుంచి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుంటే, ప్రభుత్వానికి ఏమైనా సరుకులు, వస్తువులు సరఫరా చేస్తే అప్పుడు సదరు ప్రజాప్రతినిధి తన పదవికి అనర్హుడు అవుతాడని చట్టంలో ఉందని అంటున్నారు.

హిమాంశు మోటార్స్ ద్వారా బైకుల సరఫరా అని
హిమాంశు మోటార్స్ ప్రభుత్వానికి బైకులు సరఫరా చేసిందని, ఆ కంపెనీకి ఆయన డైరెక్టర్గా ఉన్నందున ఆయన పదవికి అనర్హుడు అని విపక్షాలు మండిపడుదతున్న విషయం తెలిసిందే.

కేటీఆర్ ఖండన
అయితే, తాను తన వ్యాపారాన్ని ఎప్పుడో మానేశానని కాంగ్రెస్ పార్టీ నేతలకు కెటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను పదేళ్ల క్రితమే మానేశానన్నారు.












Click it and Unblock the Notifications