ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరండి: కరోనా పరిస్థితిపై రివ్యూ, సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో కొత్తగా 4వేలలోపే కొత్త కరోనా కేసులు: జిల్లాలవారీగా కొత్త కేసులివే, జీహెచ్ఎంసీలో 631
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరండి..
రాష్ట్రంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులపై అధికారులను సీఎం కేసీఆర్ అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6926 పడకలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రెమిడిసివిర్ వంటి ఔషధాలు కూడా ఉన్నాయని తెలిపారు. పూర్తిస్థాయి చికిత్సకు అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నందున ప్రజలంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని కేసీఆర్ సూచించారు. అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉండొద్దు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్ లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడొద్దని సూచించారు. ఒక్కొక్కటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం ఈఎన్టీ, గాంధీ ఆస్పత్రులు..
కరోనా
రోగులకు
తర్వాతి
దశలో
బ్లాక్
ఫంగస్
అనే
వ్యాధి
సోకుతున్నదని,
దానికి
సంబంధించి
చికిత్స
అందించడం
కోసం
కోఠిలోని
ఈఎన్టీ,
సికింద్రాబాద్లోని
గాంధీ
ఆస్పత్రుల్లో,
జిల్లాలోని
మెడికల్
కాలేజీ
ఆస్పత్రుల్లో
సామాగ్రి,
అవసరమైన
మందులు
సమకూర్చాలని
సీఎం
కేసీఆర్
అధికారులను
కోరారు.
ఇందుకు
అవసరమైన
25
మైక్రో
డీబ్రైడర్
మిషన్లు,
హెచ్డీ
ఎండోస్కోపిక్
కెమెరాలను
తక్షణమే
తెప్పించాలని
సీఎం
ఆదేశించారు.
ఆక్సిజన్
సరఫరాలో
ప్రభుత్వ
ఆస్పత్రులకే
ప్రాధాన్యత
ఇవ్వాలని
కేసీఆర్
సూచించారు.
వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలన్న కేసీఆర్..
కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సినేషన్ కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెప్పించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని, కోవాక్సిన్, కోవిషీల్డ్ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసులు స్టాక్ ఉందని అధికారులు సీఎం కు తెలిపారు. అందులో కోవాక్సిన్ 58,230, కోవిషీల్డ్ 1,28,550 డోసులు స్టాకు ఉందని ముఖ్యమంత్రికి వివరించారు.
భయాందోళనలకు గురికావద్దన్న కేసీఆర్..
మొత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ లలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దన్నారు.