Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నారు. నేడు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఆదివారం కావడంతో ఆ నిధులు రేపు రైతుల ఖాతాల్లో జమవుతాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నిధులను సీఎం విడుదల చేస్తున్నారు.

రైతు భరోసాపై సీఎం రేవంత్ ట్వీట్

ఈ కార్యక్రమానికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సందేశాన్ని పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాతల కోసం అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి రైతు ధైర్యంగా సాగు మడిలో నిలబడేందుకు భరోసా ఇస్తున్నానని పేర్కొన్నారు.

telangana CM Revanth Reddy shares an interesting tweet to farmers over Rythu Bharosa funds release

రైతే రాజు అని రుజువు చేస్తూ పథకం అమలు

అలాగే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధుల విడుదలను నేడు చేస్తున్నట్టు తెలిపిన ఆయన, సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.

రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన

కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి, నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామన్నారు. దీనికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాల తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు మహోత్సవం కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్!
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్!

రైతు మహోత్సవం స్టాల్స్ సందర్శించనున్న సీఎం రేవంత్

వ్యవసాయానికి సంబంధించి, దాని అనుబంధ రంగాలకు సంబంధించి 150 స్టాల్స్ ను ఆయన సందర్శిస్తారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పే ప్రయత్నాన్ని మరోమారు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా చెప్పారు. గత కొంతకాలంగా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిధులను విడుదల చేస్తున్నానని చెప్పి భరోసా ఇచ్చారు. రైతన్నకు అండదండగా నిలబడడానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+