తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు.. ఒక్కో దానికి రూ.145 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గురుకులాలను నవీకరిస్తూనే కొత్తగా మరికొన్నింటిని నిర్మించేందుకు సిద్ధం అవుతోంది. గురకులాల్లో అధికంగా పేద, మధ్య తరగతి విద్యార్థులే ఉంటారు. ఈ క్రమంలో వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించనుంది. ఈ మేరకు ఐదు గురుకులాలకు టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే వీటి నిర్మాణం చేపట్టనుంది రేవంత్ సర్కార్.
తెలంగాణలోని విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించనుంది. ఈ మేరకు ఐదు ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే వీటి నిర్మాణం చేపట్టి పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతిని కల్పించనుంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులంలో దాదాపు 2500 మంది విద్యార్థులు వసతి పొందేలా వీటిని నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఒక్కో గురుకులానికి రూ. 145 కోట్లు ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
తొలుత రాష్ట్రంలోని కొడంగల్, హుజూర్ నగర్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మరో ఐదు అవి.. కొల్లాపూర్, వరంగల్ తూర్పు, హుస్నాబాద్, షాద్ నగర్, ఆందోల్ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మించేందుకు సిద్ధమైంది. త్వరలోనే నిర్మాణాలను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం నిర్మించనున్న ఈ గురుకులాల్లో పిల్లలు 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాభ్యాసం చేయవచ్చు. ఈ గురుకులాల్లో అత్యాధునిక లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు త్వరలో రాష్ట్రంలోని గురుకులాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుకుంటామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యాభ్యాసం, వసతి, పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో పాత గురుకులాలకు ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాలయాల పటిష్టతకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అంతేకాక త్వరలో రాష్ట్రంలోని గురుకులాల్లో టైమింగ్స్ మారనున్నట్లు సమాచారం. కొత్త టైమింగ్స్ పై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని గురుకులాల సెక్రటరీలతో సమావేశం జరిపి తగిన చర్యలు తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications