బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో ట్వీస్ట్, వెంకటేశ్తో మూడేళ్ల క్రితమే పెళ్లి, విభేదాలు రావడంతో..
బ్యాంకు ఉద్యోగి దివ్య దారుణ హత్యకు గురైన ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. దివ్య హతమార్చిన నిందితుడు వెంకటేశ్ గౌడ్తో దివ్యకు మూడేళ్ల క్రితమై పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. వారిద్దరికీ ఉస్మానియా వర్సిటీలో చదివే సమయంలోనే పరిచయం అని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వెంకటేశ్ వేధించాడని.. ఆ సమయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత..
ప్రేమ పెళ్లి తర్వాత వారిలో విభేదాలు వచ్చాయి. ఇద్దరి కులాలు కూడా వేరు కావడంతో వెంకటేశ్ గౌడ్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు. వివాహం జరిగే సమయంలో దివ్య మేజర్ కాకపోవడంతో తర్వాత ఆమెను పేరెంట్స్ హాస్టల్లో ఉంచారు. హాస్టల్లో ఉండి దివ్య చదువుకొంటుండగా.. వెంకటేశ్ వేధించేవాడు. విషయం పెద్దల వరకు వెళ్లడంతో పంచాయతీ కూడా పెట్టారు. దివ్య జోలికి రావొద్దని పెద్దలు స్పష్టంచేయగా, రానని వెంకటేశ్ హామీ పత్రం కూడా రాసిచ్చినట్టు తెలుస్తోంది.

బ్యాంకులో ఉద్యోగం
హాస్టల్లో ఉంటూనే దివ్య చదువుకొంది. ఆరునెలల క్రితం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించింది. ఈ క్రమంలో వరంగల్కు చెందిన సందీప్ అనే యువకుడితో దివ్య పేరెంట్స్ పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 26వ తేదీన దివ్య, సందీప్ పెళ్లి జరగాల్సి ఉంది. దివ్యకు ఉద్యోగం రావడం, మరొ యువకుడితో పెళ్లి జరుగుతుందని తెలిసి వెంకటేశ్ గౌడ్ కసి పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కొద్దని ఉద్దేశంతో అంతం చేయాలనుకున్నాడు. రోజులాగే మంగళవారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన దివ్యపై దాడి చేశాడు.

15 పొట్లు
ఆరేసిన బట్టలు తీసేందుకు పైకి వెళ్లి కిందకి రాగా మృత్యువు ఎదురయ్యింది. తనతో తీసుకొచ్చిన కత్తితో మెడపై దాడి చేశాడు. గొంతు కోసి, 15 పోట్లు పొడిచి పారిపోయాడు. దివ్య కుప్పకూలిపోయింది. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. స్పాట్లోనే దివ్య చనిపోయారు.
Recommended Video


ఐదు బృందాల గాలింపు
హత్య జరిగిన తర్వాత వేములవాడలోని వెంకటేశ్ ఇంటికి తాళం వేసి ఉంది. వెంకటేశ్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆయనే హత్య చేశారనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. వెంకటేశ్ పేరెంట్స్ పరాశురాములు, తల్లి మల్లీశ్వరీని రాజన్న సిరిసిల్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గజ్వేల్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. వెంకటేశ్ కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications