బాబు వ్యూహమే: కేశినేని, టీడీపీకి టీఆర్ఎస్ షాక్.. ఎవరిని అడిగి అవిశ్వాసం పెట్టారు
Recommended Video

అమరావతి/హైదరాబాద్: అవిశ్వాస తీర్మానంపై చర్చను శుక్రవారం టీడీపీ ఎంపి కేశినేని నాని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎంపీలకు కావాల్సిన సమాచారాన్ని ఏపీ అధికారులు పంపించారని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు చక్కని వ్యూహంతో నడిపించారన్నారు. అవిశ్వాసంపై చర్చకు ఆమోదం తెలపడం తెలుగు ప్రజల విజయమన్నారు.
చదవండి: అలా అని ఎవరు చెప్పారు?: టీడీపీ అవిశ్వాసంపై సోనియా, '20న సత్తా చూపిస్తాం'
ఏపీకి న్యాయం చేయాలని తాము చేస్తున్న పోరాటానికి ఇది నిదర్శనం అన్నారు. కేంద్రం ఏపీకి మొండి చేయి చూపడంతో తాము పోరాట బాట పట్టామని చెప్పారు. మూడు రోజులుగా చక్కని వ్యూహంతో చంద్రబాబు తమను నడిపించారని ఆయన వ్యాఖ్యానించారట. టీడీపీ ఎంపీలు బృందాలుగా విడిపోయి పార్టీల మద్దతు కూడగట్టడం మొదలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఆమోదించడం వరకు ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు.
చదవండి: నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?

మొత్తం 14 అంశాలపై మాట్లాడుతాం
అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని టీడీపీ ఎంపీ కేశినేని నాని బుధవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా మొత్తం 14 అంశాలపై మాట్లాడుతామని తెలిపారు.

ఏపీపై ప్రధాని మోడీ చిన్నచూపు
అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఎక్కువ సమయం కేటాయించాలని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీనే సమాధానం చెప్పాలన్నారు. మేం మూడు నెలలుగా ధర్మపోరాటం చేస్తుంటే ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీపై ప్రధాని చిన్న చూపు చూస్తున్నారన్నారు.

టీడీపీ అవిశ్వాసంతో మాకు సంబంధం లేదు
తెలుగుదేశం పార్టీ అవిశ్వాసంతో తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పారు. కానీ అవిశ్వాసం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఎవరిని అడిగి పెట్టారని టీడీపీకి గట్టి షాకిచ్చారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని చెప్పారు.

అవిశ్వాసానికి తెరాస, బీజేడీ మద్దతిచ్చే అవకాశం లేదు
ప్రతి బిల్లుపై మా అభిప్రాయాలు, సూచనలు అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. హైకోర్టు విభజన అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. హైకోర్టు విభజన చేస్తామని గత సమావేశాల్లోనే హామీ ఇచ్చారని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంటుపై సెయిల్ నివేదిక సానుకూలంగా ఉన్నట్లుగా లేదన్నారు. కాగా, టీఆర్ఎస్ మాత్రమే కాకుండా అన్నాడీఎంకే, బీజేడీలు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే అవకాశాలు లేవు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications