హృదయవిదారకం: ఆడుకుంటూ వెళ్లిన కవలలు, రైలు ఢీకొని మృతి
కామారెడ్డి: జిల్లాలోని నర్సన్నపల్లిలో సోమవారం విషాద ఘటన చోటు చేుకుంది. ఆడుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లిన మూడేళ్ల కవలలను రైలు ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. నర్సన్నపల్లికి చెందిన చంద్రం, భాను దంపతులకు మూడేళ్ల క్రితం కవలలు విద్వేష్, విఘ్నేశ్ జన్మించారు.
సోమవారం తండ్రి పని మీద బయటికి వెళ్లగా.. పిల్లలు తల్లి వద్దనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం పిల్లలిద్దరూ ఇంటి ముందే ఆడుకుంటుండడంతో.. తల్లి ఇంటి పనిలో నిమగ్నమైంది.

కాగా, ఆడుకుంటూ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లిన చిన్నారులను మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ ఢీకొంది. శరీర భాగాలు చెల్లాచెదురై.. ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
కాగా, ఈ కవలలు ఒకే రూపురేఖలు ఉండటంతో స్థానికులు కూడా ఎంతో ఇష్టంగా వారిని తరచూ ఆడిస్తూ ఉండేవారు. అలాంటి వారు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు స్థానికులు కూడా కన్నీటిపర్యాంతమయ్యారు. కవలల మృతితో వారి కన్నతల్లి రోదనలు మిన్నంటాయి. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కవలల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications