హృదయవిదారకం: ఆడుకుంటూ వెళ్లిన కవలలు, రైలు ఢీకొని మృతి
కామారెడ్డి: జిల్లాలోని నర్సన్నపల్లిలో సోమవారం విషాద ఘటన చోటు చేుకుంది. ఆడుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లిన మూడేళ్ల కవలలను రైలు ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. నర్సన్నపల్లికి చెందిన చంద్రం, భాను దంపతులకు మూడేళ్ల క్రితం కవలలు విద్వేష్, విఘ్నేశ్ జన్మించారు.
సోమవారం తండ్రి పని మీద బయటికి వెళ్లగా.. పిల్లలు తల్లి వద్దనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం పిల్లలిద్దరూ ఇంటి ముందే ఆడుకుంటుండడంతో.. తల్లి ఇంటి పనిలో నిమగ్నమైంది.

కాగా, ఆడుకుంటూ ఇంటికి కొద్దిదూరంలో ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లిన చిన్నారులను మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ ఢీకొంది. శరీర భాగాలు చెల్లాచెదురై.. ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
కాగా, ఈ కవలలు ఒకే రూపురేఖలు ఉండటంతో స్థానికులు కూడా ఎంతో ఇష్టంగా వారిని తరచూ ఆడిస్తూ ఉండేవారు. అలాంటి వారు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులతోపాటు స్థానికులు కూడా కన్నీటిపర్యాంతమయ్యారు. కవలల మృతితో వారి కన్నతల్లి రోదనలు మిన్నంటాయి. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కవలల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications