రెండు, మూడురోజుల్లో స్థానిక సమరం : 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఈసీ
హైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద స్థానిక సమరం జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా .. నోటిఫికేషన్ విడుదల ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18 నుంచి 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివిధ విభాగాల అధికారులతో సోమవారం సమీక్షించినట్టు తెలిపారాయన.

కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం
రాష్ట్రంలోని 32 జెడ్పీ, 535 ఎంపీపీ, 534 జెడ్పీటీసీ, 5875 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్విహిస్తామని తెలపారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న కలెక్టర్లు, ఎస్సీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఓటరు జాబితాతోపాటు పోలింగ్ బూత్, అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత బ్యాలెట్ పేపర్లపై సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. ఈ నెల 20 నాటికి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications