కేసీఆర్పైనే అనుమానం, కుట్ర పూరితంగానే ఐటీ దాడులు: ఉదయసింహా
హైదరాబాద్: తనను, తన కుటుంబసభ్యుల్ని ఐటీ దాడుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహా ఆరోపించారు. ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఎదుట ఉదయసింహా, సెబాస్టియన్ సోమవారం విచారణకు హాజరయ్యారు.
గత బుధవారం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహా నివాసంలో అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపారు.

సోమవారం విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికి సూచించడంతో బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో ఉదయసింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తి చేసిన అధికారులు అక్టోబర్ 3న మరోసారి హాజరుకావాలని ఉదయసింహాకు సూచించారు.
ఈ సందర్భంగా ఉదయసింహా మీడియాతో మాట్లాడుతూ.. తనను, తన కుటుంబసభ్యులను ఐటీ దాడుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నాగోల్ జైపురి కాలనీలో తన సోదరుడి ఇంట్లో సోదాలపై ఐటీ అధికారులను అడగ్గా.. ఎలాంటి సోదాలు చేయలేదని వారు బదులిచ్చారని తెలిపారు.
ఈ నేపథ్యంలో సోదాలకు వచ్చింది నకిలీ అధికారులుగా తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక, సోదాలు జరిపింది కేసీఆర్ మనుషులని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. ఆదివారం కొందరు ఐటీ అధికారులమని చెప్పుకుంటూ ఉదయసింహా బంధువైన రణధీర్ ఇంట్లో సోదాలు చేసి నగలు, నగదు తీసుకెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications