కేసీఆర్పైనే అనుమానం, కుట్ర పూరితంగానే ఐటీ దాడులు: ఉదయసింహా
హైదరాబాద్: తనను, తన కుటుంబసభ్యుల్ని ఐటీ దాడుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహా ఆరోపించారు. ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఎదుట ఉదయసింహా, సెబాస్టియన్ సోమవారం విచారణకు హాజరయ్యారు.
గత బుధవారం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహా నివాసంలో అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపారు.

సోమవారం విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గురికి సూచించడంతో బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో ఉదయసింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తి చేసిన అధికారులు అక్టోబర్ 3న మరోసారి హాజరుకావాలని ఉదయసింహాకు సూచించారు.
ఈ సందర్భంగా ఉదయసింహా మీడియాతో మాట్లాడుతూ.. తనను, తన కుటుంబసభ్యులను ఐటీ దాడుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నాగోల్ జైపురి కాలనీలో తన సోదరుడి ఇంట్లో సోదాలపై ఐటీ అధికారులను అడగ్గా.. ఎలాంటి సోదాలు చేయలేదని వారు బదులిచ్చారని తెలిపారు.
ఈ నేపథ్యంలో సోదాలకు వచ్చింది నకిలీ అధికారులుగా తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక, సోదాలు జరిపింది కేసీఆర్ మనుషులని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. ఆదివారం కొందరు ఐటీ అధికారులమని చెప్పుకుంటూ ఉదయసింహా బంధువైన రణధీర్ ఇంట్లో సోదాలు చేసి నగలు, నగదు తీసుకెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications