పంటనష్టంపై కేంద్రానికి నివేదిక: వెంకయ్య(పిక్చర్స్)
నల్గొండ: గత రెండు మూడు రోజులుగా కురిసిన అకాల వర్షం, వడగళ్లతో తెలంగాణ వ్యాప్తంగా పంటలకు అపార నష్టం జరిగిందని, నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం వెంకయ్యనాయుడు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి మోహన్భాయ్ కందారియా, బిజెజి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించారు.
జిల్లాలోని పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, రేవణపల్లి, బీబీనగర్ మండలం బట్టుగూడెం, గుర్రాలదండి, జంపల్లి, భువనగిరి మండలం అనాజిపురం, బొమ్మాయిపల్లిలో పంటలను పరిశీలించారు.
వరి పంట, మామిడి, బొప్పాయి తోటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి నష్టాన్ని తెలుసుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మార్కెట్యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

వెంకయ్యనాయుడు
గత రెండు మూడు రోజులుగా కురిసిన అకాల వర్షం, వడగళ్లతో తెలంగాణ వ్యాప్తంగా పంటలకు అపార నష్టం జరిగిందని, నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వెంకయ్యనాయుడు
బుధవారం వెంకయ్యనాయుడు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి మోహన్భాయ్ కందారియా, బిజెజి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించారు.

వెంకయ్యనాయుడు
జిల్లాలోని పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, రేవణపల్లి, బీబీనగర్ మండలం బట్టుగూడెం, గుర్రాలదండి, జంపల్లి, భువనగిరి మండలం అనాజిపురం, బొమ్మాయిపల్లిలో పంటలను పరిశీలించారు.

వెంకయ్యనాయుడు
వరి పంట, మామిడి, బొప్పాయి తోటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి నష్టాన్ని తెలుసుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మార్కెట్యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

వెంకయ్యనాయుడు
అంతకుముందు భూదాన్పోచంపల్లి మండలంలో కొత్తగూడెం గేటు వద్ద కేంద్ర మంత్రుల బృందానికి ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి స్వాగతం పలికారు.

వెంకయ్యనాయుడు
ఈ సందర్భంగా భువనగిరిలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులకు నష్టం జరిగినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్)ద్వారా సహాయం అందించవచ్చని సూచించారు.
ప్రకృతి వైపరీత్యం వల్ల రైతులకు నష్టం జరిగినప్పుడు ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్)ద్వారా సహాయం అందించవచ్చని సూచించారు. 2015-16 ఏడాదికిగాను ఎస్డీఆర్ఎఫ్ రూ.274 కోట్లు ఉండగా రూ.205 కోట్ల నిధులు కేంద్రం, రూ.68 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చన్నారు.
రైతులకు పంటల బీమా పథకాన్ని సమగ్రంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు బ్యాంక్ల్లో చేసిన ఇన్సూరెన్స్కు అధికారులు సర్వే నంబర్ ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రి మోహన్భాయ్ కందారియా, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications