ఉప ఎన్నికలకు భయపడం, కేసీఆర్ది అదో స్టంట్: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలు అంటే భయం లేదని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి గురువారం అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు వ్యవహారం ఏమాత్రం సరికాదన్నారు. దీనిని ఆయన తప్పుబట్టారు.

మూడో ఫ్రంట్ కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకేనని జైపాల్ రెడ్డి అన్నారు. అదో స్టంట్ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు.
ఆయన మాటలకు తెలంగాణ ప్రజల్లో విలువ లేదన్నారు. అవసరమైతే జాతీయస్థాయిలో తిరుగుబావుటా ఎగరేవేస్తామన్నారు.












Click it and Unblock the Notifications