అక్రమ సంబంధం మోజులో.. భర్త మర్మావయవాన్ని చిదిమేసిన భార్య!
తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్త మర్మావయవాలను నలిపి హత్య చేసేందుకు యత్నించిందో భార్య. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో సోమవారం వెలుగు చూసింది.
కొత్తగూడ: తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్త మర్మావయవాలను నలిపి హత్య చేసేందుకు యత్నించిందో భార్య. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో సోమవారం వెలుగు చూసింది.
ఇష్టంలేని పెళ్లితో ఇంట్లోంచి పరారై.. తిండి తిప్పలు లేక.. మూడ్రోజులు రైల్లోనే..
షాకింగ్: పిల్లలు పుట్టడం లేదని వివాహిత వస్తే.. ఈ డాక్టర్ ఏం చేశాడంటే...
ఓటాయికి చెందిన పెండ్యాల సారయ్య భార్యకు కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రోజు ప్రియుడు నేరుగా ఇంటికే రావడంతో సారయ్య భార్యతో గొడవ పడ్డాడు.
అది కాస్తా ముదిరి సోమవారం కొట్టుకునే స్థాయికి చేరింది. కోపం పట్టలేక సారయ్య మర్మావయవాలను అతని భార్య చిదిమివేసింది. దీంతో విపరీతంగా రక్తస్రావమై సారయ్య కేకలు పెడుతుండగా విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను చితకబాదారు.
సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించి అతడ్ని నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సారయ్య బంధువులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం ఉందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సతీష్ చెప్పారు.