ప్రేమ పేరుతో వంచన: శారీరకంగా దగ్గరై మొహం చాటేశాడు
ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి సుమారు ఆరేళ్లపాటు కలిసి తిరిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన సంఘటనలో ఓ యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు కేయేసీ ఇన్స్పెక్టర్ ఎస్.ఎం. అలీ తెలిపారు.
వరంగల్ : ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి సుమారు ఆరేళ్లపాటు కలిసి తిరిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన సంఘటనలో ఓ యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు కేయేసీ ఇన్స్పెక్టర్ ఎస్.ఎం. అలీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన జయశ్రీ అనే అమ్మాయి కుటుంబం ఉద్యోగరీత్యా గత ఎనిమిదేళ్ల క్రింత హన్మకొండ మండం గోపాల్పూర్ గ్రామానికి వచ్చి స్థిరపడిరది.
వరంగల్ నగరంలోని ఓ బ్యాంక్లో పనిచేస్తున్న జయశ్రీ అనే యువతికి గోపాపూర్కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు మాయమాటు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే సుమారు ఆరు సంవత్సరా పాటు ప్రేమలో మునిగిన వెంకటేశ్ యువతితో కలిసి తిరిగాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఆమెకు పలుమార్లు దగ్గరయ్యాడు. ఇప్పుడు జయశ్రీ పెళ్లి ప్రస్తావన ఎత్తేసరికి యువకుడు ముఖం చాటేశాడు.
ఈ విషయంలో పుమార్లు రెండు కుంబా మధ్య గొడమ జరిగాయి. కాగా మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యు కేయూసీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేయూసీ ఇన్స్పెక్టర్ ఎస్.ఎం. ఆలీ జయశ్రీ, వెంకటేశ్తోపాటు ఇరువురి కుటుంబా పెద్దకు పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ విషయంలో వెంకటేశ్, అతని కుటుంబ సభ్యు జయశ్రీతో పెళ్లికి నిరాకరించారు. కాగా బాధితురాలి కుటుంబ సభ్యు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలీ తెలిపారు.