దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తులో పురోగతి .. ఘటన ఎప్పుడు జరిగిందంటే
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు . అసలీ వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి అన్న దానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఏడాది జూన్ నెలలో వెండి సింహాలు మాయం అయినట్టు గుర్తించారు.

మూడు సింహాలు ఒకేసారి చోరీ కాలేదు .. జూన్ 26న రెండు సింహాలు మాయం
ఇటీవల విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో మూడు సింహాలు మాయం కావటం ఏపీలో పెద్ద దుమారం రేపింది . నాలుగు సింహాలలో మూడు మాయం కాగా ఒకటి మాత్రమే మిగిలి ఉండగా ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో కీలక పురోగతి కనిపించింది. మూడు సింహాలు ఒకేసారి మాయం కాలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండు సింహాల విగ్రహాలు మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు.

జూన్ 29న మరో రెండు సింహాల చోరీ యత్నం .. కానీ ఒకటే చోరీ
ఆ తర్వాత జూన్ 29వ తేదీన మరో రెండు సింహాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో ఒక సింహం చోరీ చెయ్యగా , మరొక దానిని తీసుకెళ్లలేకపోయారు. అయితే ఈ కేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు . అసలు ఈ కేసు పోలీసులకు సవాల్ విసిరింది . గత ఉగాది తర్వాత నుండి ఇప్పటి వరకు రథాన్ని వినియోగించకపోవటంతో ఘటన ఎప్పుడు జరిగిందో అన్న అనుమానం కలిగింది .

అడుగడుగునా కీలక సవాళ్ళతో పోలీసుల దర్యాప్తు .. ఎట్టకేలకు కేసు దర్యాప్తులో పురోగతి
వెండి సింహాలు మాయమైన ఘటనలో అడుగడుగునా పోలీసులు సవాల్ ఎదుర్కొన్నారు . వెండి సింహాలు చోరీ వార్త బయటకు రాగానే రథ ప్రదేశంలో ప్రతిపక్ష పార్టీలు హడావిడి చేశాయి. దీంతో వేలిముద్రల సేకరణ ఇబ్బందిగా మారింది. డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేద్దామన్నా చాలామంది రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వచ్చి వెళ్లడంతో అది సాధ్యం కాలేదు . ఆలయ అప్రైజల్ సమీ, ఏఈవో రమేష్ లను , ఆలయ సిబ్బందిని విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసులో పురోగతి సాధించారు. ఎప్పుడు చోరీ జరిగిందో గుర్తించిన పోలీసులు ఎవరు చోరీ చేశారో కూడా గుర్తించినట్టే తెలుస్తుంది .
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications