Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తులో పురోగతి .. ఘటన ఎప్పుడు జరిగిందంటే

విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు . అసలీ వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి అన్న దానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఏడాది జూన్ నెలలో వెండి సింహాలు మాయం అయినట్టు గుర్తించారు.

మూడు సింహాలు ఒకేసారి చోరీ కాలేదు .. జూన్ 26న రెండు సింహాలు మాయం

మూడు సింహాలు ఒకేసారి చోరీ కాలేదు .. జూన్ 26న రెండు సింహాలు మాయం

ఇటీవల విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో మూడు సింహాలు మాయం కావటం ఏపీలో పెద్ద దుమారం రేపింది . నాలుగు సింహాలలో మూడు మాయం కాగా ఒకటి మాత్రమే మిగిలి ఉండగా ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో కీలక పురోగతి కనిపించింది. మూడు సింహాలు ఒకేసారి మాయం కాలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండు సింహాల విగ్రహాలు మాయమైనట్లుగా పోలీసులు గుర్తించారు.

 జూన్ 29న మరో రెండు సింహాల చోరీ యత్నం .. కానీ ఒకటే చోరీ

జూన్ 29న మరో రెండు సింహాల చోరీ యత్నం .. కానీ ఒకటే చోరీ

ఆ తర్వాత జూన్ 29వ తేదీన మరో రెండు సింహాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో ఒక సింహం చోరీ చెయ్యగా , మరొక దానిని తీసుకెళ్లలేకపోయారు. అయితే ఈ కేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు . అసలు ఈ కేసు పోలీసులకు సవాల్ విసిరింది . గత ఉగాది తర్వాత నుండి ఇప్పటి వరకు రథాన్ని వినియోగించకపోవటంతో ఘటన ఎప్పుడు జరిగిందో అన్న అనుమానం కలిగింది .

అడుగడుగునా కీలక సవాళ్ళతో పోలీసుల దర్యాప్తు .. ఎట్టకేలకు కేసు దర్యాప్తులో పురోగతి

అడుగడుగునా కీలక సవాళ్ళతో పోలీసుల దర్యాప్తు .. ఎట్టకేలకు కేసు దర్యాప్తులో పురోగతి


వెండి సింహాలు మాయమైన ఘటనలో అడుగడుగునా పోలీసులు సవాల్ ఎదుర్కొన్నారు . వెండి సింహాలు చోరీ వార్త బయటకు రాగానే రథ ప్రదేశంలో ప్రతిపక్ష పార్టీలు హడావిడి చేశాయి. దీంతో వేలిముద్రల సేకరణ ఇబ్బందిగా మారింది. డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేద్దామన్నా చాలామంది రాజకీయ పార్టీల నేతలు అక్కడికి వచ్చి వెళ్లడంతో అది సాధ్యం కాలేదు . ఆలయ అప్రైజల్ సమీ, ఏఈవో రమేష్ లను , ఆలయ సిబ్బందిని విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసులో పురోగతి సాధించారు. ఎప్పుడు చోరీ జరిగిందో గుర్తించిన పోలీసులు ఎవరు చోరీ చేశారో కూడా గుర్తించినట్టే తెలుస్తుంది .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+