విజయవాడలో కలకలం రేపిన బాక్స్: ఇరీడియం ఉందా, రైస్ పుల్లింగ్ బ్యాచ్ పనా?
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఓ బాక్స్ కలకలం చెలరేగింది. ఈ అనుమానాస్పద బాక్సును పోలీసులు బాంబు స్క్వాడ్తో పరిశీలించారు. బాక్సులో ప్రమాదకర ఇరీడియం, యూరేనియం పదార్థాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో ఈ బాక్సును తెరిచేందుకు నిపుణులను పిలిపించారు.
ఈ బాక్సులో రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు దానిని రహస్య ప్రదేశంలో ఉంచారు. బాక్సు తెచ్చిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బాక్సును చెన్నై నుంచి రూ.5 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా నిందితులు వెల్లడించారు. వీరు రైస్ పుల్లింగ్ బ్యాచ్గా పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రపంచంలో దొరికే అతి విలువైన ఖనిజాల్లో ఇరీడియం ఒకటి. బంగారం, ప్లాటినం కంటే దీని ధర 30 రెట్లు అధికంగా పలుకుతుంది. విమానాలు, శాటిలైట్ తయారీలో ఇరీడియంను వినియోగిస్తారు. ఇరీడియం ఉన్నచోట విపరీతమైన రేడియేషన్ ఉంటుంది.