కదులుతున్న రైలులో ప్రేమికులు.. ఒక్కసారిగా ....
అమరావతి/ విజయనగరం : ఆ రైలు కదులుతుంది. అందులో ఓ ప్రేమ జంట ఉంది. వారిద్దరూ కలిసి చేయిపట్టుకున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా రైలు నుంచి దూకేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. వారు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే అంశంపై క్లారిటీ రాలేదు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదా ? పెళ్లికి ఒప్పుకోలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం జిల్లా నెల్లిమర్లకు రైలు చేరుకుంది. నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపిస్తుండటంతో స్పీడ్ తగ్గింది. అయితే అదీ గమనించని ఓ జంట .. రైలు నుంచి దూకేశారు. రైలు స్పీడ్ తక్కువ ఉండటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. వారి సూసైడ్ అటెంప్ట్ను చేసిన ట్రాక్ సిబ్బంది .. వెంటనే అక్కడికి చేరుకున్నారు. 108 వాహనం ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వారిద్దరికీ తీవ్రగాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ జంటది బలిజిపేట మండలం అరసాడ, ఇరువాడకు చెందినవారని గుర్తించారు. వారు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనే అంశంపై స్పష్టత రాలేదు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించి ఉండరని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలిసి జీవించలేని తాము .. కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఒక్కటై .. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications