లీడర్ ఓడిపోయాడని ఎగతాళి చేస్తే.. వేలు నరుక్కున్న అభిమాని
భూపాలపల్లి జిల్లా : అభిమానానికి అంతుండదేమో. తాము అభిమానించే వ్యక్తులను ఆరాధిస్తుంటారు ఫ్యాన్స్. అది సినిమారంగమైనా, రాజకీయమైనా.. నచ్చితే చాలు గుండెల్లో పెట్టుకుంటారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన అభిమానానికి హద్దు లేదని నిరూపిస్తోంది. ఓ అభిమాని ఏకంగా చేతి వేలిని నరుక్కోవడం చర్చానీయాంశంగా మారింది.
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గండ్ర సత్యనారాయణరావు అలియాస్ సత్తన్న పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే చిట్యాల మండలం భీష్మ నగర్ లో నివాసముండే చిట్ల మల్లేశ్ అనే యువకుడు సత్తన్న ఇమేజ్ తో ఉన్న ఎలక్షన్ టీ షర్ట్ వేసుకున్నాడు. దీంతో ఓడిపోయిన నాయకుడికి సంబంధించిన టీషర్ట్ ఎందుకు వేసుకున్నావని ఇతర పార్టీలకు చెందినవారు ఎగతాళి చేశారట.

మనస్థాపం చెందిన మల్లేశ్ తన ఎడమ చేతి వేలును గొడ్డలితో నరుక్కున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు స్థానిక వైద్యుడితో చికిత్స చేయించారు. అయితే గెలుపోటములకు సంబంధం లేకుండా తాను ఎల్లప్పుడూ సత్తన్న వీరాభిమానిని అంటూ ఆయన కోసం ఏమైనా చేస్తానంటున్నాడట మల్లేశ్.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications