విషాదం: ఆర్టీసీ బస్సులోనే ఉరివేసుకుని కండక్టర్ ఆత్మహత్య
టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది.
వరంగల్: టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది.అనారోగ్యంగా ఉండటంతో మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు మహేందర్ సెలవులో ఉన్నారు.
అయితే, ఆదివారం వరకు సెలవు ఉన్నా.. నిన్న ఉదయం 11 గంటలకు డిపోకు వచ్చిన మహేందర్ డ్యూటీ వేయించుకున్నాడు. అయితే, అప్పట్నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. సిబ్బంది ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు డిపో ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ఓ బస్సులో తన టవల్తో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు.

ఆర్టీసీ సిబ్బంది వెంటనే అధికారులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య అరుణ, కుమారులు విక్రమ్, వినయ్లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మహేందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, మహేందర్ విధి నిర్వహణలో ఉండి.. బస్సులోనే ఉరివేసుకోవడం తీవ్ర బాధను కలిగించిందని జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ కమల్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఎంత వేధిస్తే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడో అని ఆందోళన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆయన కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కండక్టర్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నారంటే ఆర్టీసీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ కమల్ రెడ్డి. చాలీచాలని జీతాలతో, అధికారుల వేధింపులతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ పోషణకై ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మహేందర్ రెడ్డి కుటుంబానికి రూ. 30 ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications