వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బే ఏరియాలో తెలంగాణపై సమావేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
సన్నివేల్‌: తెలంగాణ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై బే ఏరియా తెలంగాణ ప్రవాసాంధ్రులు సమావేశమై చర్చించారు. సన్నివేల్‌లోని ఫెయిర్‌ ఓక్స్‌ వెస్ట్‌ క్లబ్‌ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా తెలంగాణ వాసులు హాజరయ్యారు. వివిధ ప్రవాస సంఘాల సహకారంతో దయానంద్‌ దుద్యాల, శ్రీధర్‌ గుర్రమ్‌, సురేందర్‌ పెంచల, యుగంధర్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. తెలంగాణ అఖిలపక్ష ఉద్యమ కార్యాచరణ సమితి (జెఎసి) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఈ సమావే శంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవాస తెలంగాణ వాసులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం వివరించి, ప్రస్తుత ఉద్యమంలో ఎన్నారైలు పోషించవలసిన పాత్రను కోదండరామ్‌ తెలియజేసారు. సమావేశంలో మాట్లాడిన మిగిలిన వక్తలు రాష్ట్ర ఏర్పాటుపై భారత ప్రభుత్వం యూటర్న్‌ తీసుకున్నదని అభిప్రాయపడ్డారు. దీనికి నిరసనగా ప్రతీ ఒక్కరూ శాంతియుతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీలు, విద్యార్దులు, ఉద్యోగులు తదితరులు జెఎసిగా ఏర్పడడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. ఉద్యమ కార్యాచరణ సమితికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు విడివిడిగా, కలివిడిగా ఉన్నప్పుడు ఉద్యమ పరిస్థితులను ఎన్నారైలు బేరీజు వేసి సంతృప్తి వ్యక్తం చేసారు. ఉద్యమంలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా సహాయ నిరాకరణ వంటి శాంతియుత పద్దతుల ద్వారా తెలంగాణ కోసం పోరాడాలని వారు సూచించారు. వ్యాపార సముదాయాలపై తెలంగాణ పేర్లు లిఖించమని కోరడం, తెలంగాణేతర వస్తువులను బహిష్కరించడం వంటి పద్దతులను వారు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించిన ఎన్నారైలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X