వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను మోసం చేసిన ఎన్ఆర్ఐ: పెళ్లై రెండేళ్లయినా తిరిగిరాని వైనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

NRI
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ పెళ్లి చేసుకొని తన భార్యను మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బోగాపురం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెండేళ్ల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు రూ.కోటి కట్నంగా ఇచ్చారు. అయితే తాను కొద్ది రోజుల తర్వాత భార్యను తీసుకు వెళతానని చెప్పి అమెరికా వెళ్లి పోయాడు.

అయితే అమెరికా వెళ్లిన విజయ్ కుమార్ రెండేళ్లు గడిచినా తిరిగి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు బోగాపురంలోని విజయ్ కుమార్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పెళ్లి పేరుతో భార్యను మోసం చేసిన ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు యువతి బంధువుల ఆందోళన కారణంగా పరారయినట్లుగా తెలుస్తోంది.

English summary
NRI husband cheated his wife in west godavari district. He married a lady before two years and went to America but no returned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X