అమెరికాలో తప్పించుకుంటున్న టెక్కీ

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన సురేష్ కుమార్ 2005లో పూర్ణిమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత కొన్నెళ్లకు వారిద్దరు కలిసి అమెరికా వెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం - కొన్నాళ్లకు అతను ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఎంసిఎ గ్రాడ్యుయేట్ అయిన పూర్ణిమ అతనిపై కేసు పెడతానని బెదిరించింది. దానికి భయపడి ఆమెను బుజ్జగించి ఇండియాకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత 2007 డిసెంబర్లో ఆమెను వదిలేసి అమెరికాకు పారిపోయాడు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా వెంట తీసుకుని వెళ్లాడు.
పెళ్లి సమయంలో తాము 15 లక్షల రూపాయలు ఇచ్చామని, మరిన్ని డబ్బుల కోసం తమ కూతురును సురేష్ కుమార్ వేధిస్తూ వచ్చాడని ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తున్న సమయంలో తాను సంపాదించిన 28 వేల డాలర్లను కూడా సురేష్ కుమార్ డ్రా చేసుకున్నాడని చెప్పి పూర్ణిమ బోస్టన్ కోర్టులో కేసు వేసింది.












Click it and Unblock the Notifications