తెలంగాణ కోసం గల్ఫ్లో ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన పొన్నాల రాజయ్య పదేళ్ల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. శ్రవణ్ కూడా 2010లో కంపెనీ వీసాపై తండ్రి వద్దకు వెళ్లి ఉద్యోగం చూసుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్లో రాజయ్య గుండె పోటుతో మృతిచెందాడు. తన తండ్రి శవాన్ని గల్ఫ్ నుంచి స్వగ్రామం మల్లారెడ్డిపేటకు తీసుకు వచ్చాడు.
తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో శ్రవణ్ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతుండడం గుర్తించి దాని పట్ల ఆకర్షితుడయ్యాడు. శ్రవణ్ కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఆందోళనలు నిర్వహించారు. కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో శ్రవణ్ 2010 అక్టోబర్లో మళ్లీ గల్ఫ్కు వెళ్లి పోయాడు.
గత నెల రోజులుగా జరుగుతున్న తెలంగాణ పరిణామాలపై శ్రవణ్ ఆందోళనకు గురయ్యాడని శ్రవణ్ స్నేహితులు వివరించారు. ఆదివారం ఉదయం బహ్రెయిన్లో తానుంటున్న గదిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications