వైఎస్ కు ఘనంగా నివాళులు అర్పించిన వైసీపీ ఎన్నారై నేతలు
డెట్రాయిట్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 10వ తేదీన ట్రాయ్ లో వర్దంతి సభ నిర్వహించారు వైసీపీ ఎన్నారై నేతలు. దాదాపుగా వంద మంది వరకు పాల్గొన్న ఈ సభలో వైఎస్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనమైన నివాళి అర్పించారు.
లైటింగ్ ల్యాంప్ ద్వారా ఏర్పాటు చేసిన దీపాలతో వైఎస్ కు నివాళులు అర్పించిన వైసీపీ ఎన్నారై నేతలు.. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి హాజరైన పలువురు వైసీపీ నేతలు, వైఎస్ అభిమానులు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జన హ్రుదయ నేతగా ఆయన ప్రజల మదిలో నిలిచిపోయిన తీరు గురించి పలువురు వక్తలు ఆసక్తికర ప్రసంగం చేశారు.

మానసికంగా, శారీరకంగా వైఎస్ చాలా ధ్రుడవంతులన్న విషయాన్ని ఈ సందర్బంగా పలువురు నేతలు గుర్తు చేశారు. తన జీవితాంతం రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా ఆయన్ను కొనియాడారు.
ఈ నేపథ్యంలోనే.. ఏపీ అధికార పార్టీ టీడీపీపై పలు విమర్శలు చేశారు వైసీపీ నేతలు. ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామిని నిలబెట్టుకోలేకపోయిందని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు తామంతా పార్టీ అధినేత జగన్ కు అండగా నిలబడుతామని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే.. గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని తిరిగి పునరుద్దరిస్తామని తెలియజేశారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications