తెలుగంటే ఎంతో ఇష్టం.. అందుకే, లండన్ ఎఫ్ఎంలో ‘స్వాతి ముత్యం- పలికితే ఆణిముత్యం’
హైదరాబాద్: ''తెలుగంటే నాకిష్టం. అందుకే లండన్ వెళ్లినా తెలుగును మరువలేదు. నా పిల్లలు కూడా తెలుగు బాగా మాట్లాడతారు..'' అని చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన స్వాతి.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతి లండన్లో స్థిరపడ్డారు. అక్కడ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారామె. తెలుగులో పాటలు పాడడమేగాక.. లండన్ ఎఫ్ఎంలో 'స్వాతి ముత్యం- పలికితే ఆణిముత్యం' కార్యక్రమం ద్వారా తెలుగు శ్రోతలను అలరిస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తన గళం విప్పే అవకాశం వచ్చిందామెకు. ఈ మేరకు స్వాతికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న స్వాతి మాట్లాడుతూ లండన్లో మన సాహితీవేత్తలను ఎంతో గౌరవిస్తుంటారని చెప్పారు. ''అక్కడ సంగీతం, నృత్యకళలకూ ఆదరణ ఎక్కువే, తెలుగు పాట పాడాలని ఇక్కడికొచ్చా.. లండన్లో ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంటాం.. సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు..'' అని చెప్పారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications