వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుడి హత్య: మలేషియన్‌కు మరణశిక్ష

|
Google Oneindia TeluguNews

సింగపూర్: భారతదేశానికి చెందిన వ్యక్తిని హత్య చేసిన కేసులో ఓ మలేషియన్‌కు ఉరిశిక్ష పడింది. నిర్మాణ రంగంలో పని చేస్తున్న భారతీయుడ్ని 2010లో నిందితుడు హత్య చేశాడు. హైకోర్టు జడ్జి చూ హన్ తెక్... నిందితుడు మైకేల్ గేరింగ్(26)కు మరణశిక్ష విధించారు.

41ఏళ్ల షన్ముగనాథన్ దిల్లిదురాయి హత్య కేసులో సరైన ఆధారాలు లభించినందున నిందితుడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. గేరింగ్ తోపాటు టోనీ ఇంబా(36) అనే వ్యక్తి కూడా హత్య కేసులో నిందితుడని తేల్చారు.

 Malaysian Man Sentenced to Death for Murder of Indian National

2010, మే 29న రాత్రి షన్ముగనాథన్‌ను వీరిద్దరూ కలిసి హత్య చేశారు. హత్య కేసులో నిందితుడైన ఇంబాకు జీవిత ఖైదు ఇస్తూ తీర్పు వెలువరించారు. నిందితులిద్దరూ తూర్పు మలేషియాలోని బోర్నియోకు చెందినవారు.

దొంగతనం చేసుకునేందుకు వచ్చిన వీరిద్దరూ నలుగురిపై దాడి చేశారు. దాడిలో షన్ముగనాథన్ మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తీర్పుపై అప్పీల్ చేస్తామని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు.

English summary
A Malaysian man was sentenced to death today for the 2010 murder of an Indian national working in Singapore's construction sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X