మిత్రులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం?

భార్యకు వేరేవారితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో పరీక్షల నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆస్పత్రి కాంపౌండర్లు ముగ్గురితో కలిసి భర్త తనకు మత్తు మందు ఇచ్చి, తనపై అత్యాచారానికి పాల్పడినట్లు నాగమణి మీడియాకు చెప్పుకుంది. తనను వివస్త్రను చేసి ఫొటోలు కూడా తీశారని ఆమె ఆరోపిస్తోంది.
అయితే, భర్త రంగారావు వాదన మరో విధంగా ఉంది. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే తాను తన భార్యను ఆస్పత్రికి తీసుకుని వచ్చానని, అత్యాచారం వంటిదేదీ జరగలేదని అతను అంటున్నాడు. అయితే, ఆత్యాచారం జరిగినట్లు తమకు ఫిర్యాదు ఏదీ అందలేదని పోలీసులు చెబుతున్నారు. భార్యాభర్తలకు సంబంధించిన గొడవపైనే తమకు ఫిర్యాదు అందిందని చెబుతున్నారు.
రంగారావును అదుపులోకి తీసుకుని పోలీసులు చెబుతున్నారు. నాగమణిపై అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయం వైద్య పరీక్షలు చేస్తేనే తేలుతుందని అంటున్నారు. తనపై అత్యాచారం చేశారని చెబుతున్న ముగ్గురిలో ఒకరి పేరు నాగమణి చెబుతోంది. తనకు మత్తు మందు ఇవ్వడం వల్ల మిగతా వారిని గుర్తించలేకపోయినట్లు ఆమె అంటోంది. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగినప్పటికీ నాగమణి శుక్రవారం మీడియా ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications